వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం!
- వైష్ణవ్ హీరోగా మరో సినిమా
- దర్శకుడిగా గిరీశాయ
- కథానాయికగా కేతిక శర్మ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
అయితే వైష్ణవ్ ప్రతి కథకు ఓకే చెప్పకుండా, తనకి బాగా నచ్చిన కథను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా కొన్ని రోజుల క్రితమే ఆయన గిరీశాయ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఇప్పుడు షూటింగును మొదలెట్టింది.
ఈ సినిమాకి బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ అలరించనుంది. 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ ఆశించినస్థాయి హిట్ ను అందుకోలేకపోయాడనే విషయం తెలిసిందే.