తెలంగాణలోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వైయస్ ఫొటోలు వున్నాయి: ఏపీ మంత్రి బాలినేని
- వైయస్ ను విమర్శిస్తున్నవారికి పుట్టగతులు ఉండవు
- వారికి ప్రజలే బుద్ధి చెపుతారు
- హుజూరాబాద్ ఎన్నికల కోసమే వైయస్ పై విమర్శలు
తెలంగాణలోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వైయస్ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, హుజూరాబాద్ ఎన్నికల కోసమే తెలంగాణ మంత్రులు వైయస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జయంతి సందర్భంగా ఒంగోలులో వైయస్ విగ్రహానికి బాలినేని పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.