ఏపీలో మరో పథకం 'జగనన్న జీవ క్రాంతి'... నేడు ప్రారంభించిన జగన్!
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గొర్రెలు, మేకలు
- రూ. 1,863 కోట్ల అంచనా వ్యయం
- మూడు విడతలుగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం
మొత్తం 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసే దిశగా రూ. 1868.63 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మూడు విడతలుగా పథకం అమలు అవుతుందని, తొలి విడతగా వచ్చే సంవత్సరం మార్చిలో 20 వేల యూనిట్లు, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య రెండో విడతగా 1,30,000 యూనిట్లు, ఆపై సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య 99 వేల యూనిట్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.