రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది... రజనీకాంత్ రాకను స్వాగతిస్తున్నాం: పన్నీర్ సెల్వం
- అనిశ్చితికి తెరదించుతూ పార్టీ ప్రకటన చేసిన రజనీ
- కుదిరితే పొత్తు పెట్టుకుంటామన్న పన్నీర్ సెల్వం
- పార్టీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షకుడిగా తమిళ్ రువి
- ట్విట్టర్ లో వెల్లడించిన రజనీ
కాగా, రజనీకాంత్ తన పార్టీ వ్యవహారాలకు సంబంధించి కసరత్తులు మొదలు పెట్టారు. పార్టీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షకుడిగా తమిళ్ రువి మణియన్ ను నియమించారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. పార్టీ కార్యకలాపాలు జనవరిలో ప్రారంభం అవుతాయని రజనీ తెలిపారు. తనను కీలక పదవిలో నియమించడం పట్ల తమిళ్ రువి మణియన్ స్పందిస్తూ, రజనీకాంత్ రాముడైతే తాను ఓ ఉడుతలా సేవలందిస్తానని తెలిపారు.