సీఎం జగన్ ను కలిసిన దివ్య తేజస్విని కుటుంబ సభ్యులు...రూ.10 లక్షల సాయం ప్రకటించిన సీఎం
- ఇటీవలే విజయవాడలో హత్యకు గురైన దివ్య తేజస్విని
- తమకు న్యాయం చేయాలంటూ సీఎంను కోరిన కుటుంబ సభ్యులు
- నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ
ఈ సందర్భంగా, ఆమె కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దివ్య తేజస్విని కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల సాయం ప్రకటించారు. వీరు సీఎంను కలిసిన సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ నేత దేవినేని అవినాశ్ కూడా అక్కడే ఉన్నారు.