‘నవరత్నాలు’కు ఆశపడి తప్పు చేశామని ప్రజలే అంటున్నారు: టీడీపీ నాయకురాలు రేవతి చౌదరి
- టీడీపీ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు అబద్ధం
- అవినీతి గురించి వైసీపీనా మాట్లాడేది!
- మంత్రులే మూర్ఖులవడంతో గందరగోళం నెలకొంది
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ అవినీతికి పాల్పడిందంటూ డప్పు కొట్టుకుంటూ ఆరోపణలు చేయడం కాదు వాటిని ఆధారాలతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రులే మూర్ఖులవడం కారణంగా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, అస్తవ్యస్త పరిపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలు, అరాచకం అనే పదాలను ఉచ్చరించే అర్హత కూడా వైసీపీ నేతలు ఎవ్వరికీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.