చిదంబరంకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
- ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని న్యాయస్థానం వ్యాఖ్యలు
- ఎయిమ్స్ బోర్డు నివేదిక ఆధారంగా కోర్టు నిర్ణయం
- ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోండంటూ జైలు అధికారులకు ఆదేశం
మరోవైపు, చిదంబరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. మెడికల్ బోర్డు సూచన మేరకు ఆయనకు ఇంటి నుంచి భోజనం, మినరల్ వాటర్ సమకూర్చాలని, దోమల నుంచి రక్షణ కల్పించాలని సూచించింది. ఇదే కేసులో చిదంబరం దాఖలు చేసుకున్న ప్రధాన బెయిల్ పిటిషన్ ఈ నెల 4న విచారణకు రానుంది. సీబీఐ కేసులో ఆయన ఇప్పటికే బెయిల్ పొందారు.