ఏపీలో గ్రామ వలంటీర్ల దసరా మామూళ్ల సందడి.. వేటేసిన అధికారులు!
- బాధితుల ఫిర్యాదుతో సీరియస్గా తీసుకున్న అధికారులు
- నలుగురు వలంటీర్ల తొలగింపు
- కృష్ణా జిల్లాలో ఘటన
అయితే కొందరు లబ్ధిదారులు మాత్రం మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించడమేకాక విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విచారణ జరిపిన బందరు ఎంపీడీఓ జి.వి.సూర్యనారాయణ వలంటీర్లపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో నలుగురిని విధుల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించిన వీఆర్ఏపై కూడా చర్య తీసుకోవాలని తహసీల్దారుకు సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల వద్దకే చేర్చాలన్న ఉద్దేశంతో జగన్ సర్కారు రూపొందించిన వలంటీర్ల వ్యవస్థ ఏర్పడి రెండు నెలలు గడవక ముందే ఇటువంటి సంఘటనలు వెలుగు చూస్తుండడంతో మున్ముందు ఎలా ఉంటుందో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.