సంక్షేమం కన్నా విధ్వంసంపై జగన్ దృష్టిపెట్టడం దురదృష్టకరం: యనమల
- ప్రజావేదిక కూల్చివేత నిర్ణయమొక తుగ్లక్ చర్య
- లేఖకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే కూల్చివేత నిర్ణయం
- పోలవరం నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా?
కాగా.. ప్రజావేదిక భవనం టీడీపీకి ఇవ్వాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. ఈ విషయాన్ని ప్రస్తావించిన యనమల.. లేఖకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రజావేదికను కూల్చివేయాలనే సర్కార్ నిర్ణయించిందని ఆరోపించారు. సచివాలయంలోని భవనాలను.. 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా? అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని యనమల ప్రశ్నించారు.