జైశ్రీరాం అని ఇక్కడ కాకపోతే పాకిస్థాన్ లో అనాలా?: అమిత్ షా
- జైశ్రీరాం అనగానే మమత ఉలిక్కి పడుతున్నారు
- పశ్చిమబెంగాల్ లో బీజేపీ 23కు పైగా స్థానాలను గెలుచుకుంటుంది
- జైశ్రీరాం అనకుండా మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు
పశ్చిమబెంగాల్ లో బీజేపీ 23కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దీదీ తమ ర్యాలీలను అడ్డుకోవచ్చని, అబద్ధాలు ప్రచారం చేయవచ్చని... ఏది చేసినా తాము 23కు పైగా స్థానాలను గెలుచుకోవడాన్ని మాత్రం ఆపలేరని చెప్పారు. మోదీని ప్రధానిగా పరిగణించడం లేదని మమత అంటున్నారని... రాజ్యాంగం ప్రకారం ప్రజలే ప్రధానిని ఎన్నుకుంటారనే విషయం ఆమెకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.