ఐపీఎస్ అధికారి తమ్ముడిని కాల్చి చంపిన భద్రతాబలగాలు
- షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్
- ముగ్గురు ఉగ్రవాదుల హతం
- మృతుల్లో ఒకరు ఐపీఎస్ అధికారి సోదరుడు
మరోవైపు ఉగ్రవాదుల నుంచి మూడు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ జవాను కూడా గాయపడ్డాడని... అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతాదళాలను అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. ఈ నేపథ్యంలో వారిపై బాష్పవాయుగోళాలను, పెల్లెట్లను ప్రయోగించి చెదరగొట్టారు. ఈ ఎన్ కౌంటర్ లో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు.