పూజారిపై పోలీసు దాడి...12 గంటలు మూతపడిన పూరీ జగన్నాథుని ఆలయం
- ఆందోళనకు దిగిన పూజారులు
- గర్భాలయానికి తాళం వేసి నిరసన
- ఓ విదేశీ భక్తుడిని స్వామి దర్శనానికి తీసుకువెళ్తుండగా వివాదం
ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగగా పూజారిపై పోలీసు దాడిచేశాడు. ఈ చర్యను నిరసిస్తూ ఆలయంలోని పూజారులంతా ఆందోళనకు దిగారు. వెంటనే గర్భాలయానికి తాళం వేసి ఆందోళనచేపట్టారు. ఇంత జరిగినా అధికారులు కిమ్మనక పోవడంతో దాదాపు 12 గంటలపాటు ఆలయం మూతపడింది. స్వామి దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విషయం కలెక్టర్కు తెలియడంతో ఆయన రంగంలోకి దిగారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించి సదరు పోలీసు తప్పుచేసినట్టు రుజువైతే 24 గంటల్లో చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో పూజారులు శాంతించారు. ఆలయాన్ని తెరిచారు. కాగా, ఆందోళన కారణంగా శుక్రవారం ఉదయం ప్రాత:కాల కైంకర్యం నిలిచిపోయింది. ఇటువంటి దురదృష్టకర పరిస్థితి ఆలయ చరిత్రలో తొలిసారి నెలకొందని పూరీ గజపతి మహారాజ్ రాజా దివ్యసింగ్దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.