అందుకే, ప్రజాకూటమి ఓటమిపాలైంది: సీపీఐ నేత చాడ
- సీట్ల సర్దుబాటులో జాప్యం వల్లే కూటమి ఓడింది
- పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ లో ఓట్ల సంఖ్యే ఎక్కువ
- కేసీఆర్ కనుసన్నల్లో ఈసీ నడిచింది
సీట్ల సర్దుబాటులో జాప్యం కారణంగానే ప్రజాకూటమి ఓటమిపాలు కావాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ లో వచ్చిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉందని, కేసీఆర్ కనుసన్నల్లో ఈసీ నడిచిందని ఆరోపించారు. ప్రజాకూటమి అజెండాను కేసీఆర్ హైజాక్ చేశారన్న చాడ, కూటమిలో కొనసాగే విషయమై జాతీయ నాయకత్వంతో చర్చించాల్సి ఉందని స్పష్టం చేశారు.