'ఇదం జగత్' నుంచి మనసును తాకే మెలోడీ
- సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
- యామిని ఘంటసాల ఆలాపన
- ఈ నెల 28వ తేదీన విడుదల
"మనసే మనసే నీ చెలిమితోనే మురిసే .. సమయం నీతో గడపాలన్న ఆశే .. విధి చేసిన ఒక గాయమే .. మది భారమై అలిసే .. నిను కలిసిన మరు నిమిషమే ఆనందమంటే తెలిసే .." అంటూ సాగుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం .. రమేశ్ సాహిత్యం .. యామిని ఘంటసాల ఆలాపన చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మెలోడీ గీతాల జాబితాలో ఈ పాట చేరుతుందని చెప్పొచ్చు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సుమంత్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.