ముంచుకొస్తున్న ‘తిత్లీ’.. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
- 100 నుంచి 130 కి.మీ వేగంతో ఈదురుగాలులు
- గాలుల తీవ్రత 145 కి.మీ వరకు పెరిగే అవకాశం
- ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ
- సికింద్రాబాద్-హవ్డా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. రేపు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం-సంతబొమ్మాళి మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ ద్వారా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో ఏడో నంబర్.. విశాఖ, గంగవరం ఓడరేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. తిత్లీ తుపాను కళింగపట్నానికి 230కి.మీ, గోపాల్పూర్కు 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్-హవ్డా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, బిలాస్పూర్ మీదుగా దారి మళ్లించారు.