మహాత్మునికి ఇష్టమైన పాట.. పాక్ గాయకుని నోట!
- ‘వైష్ణవ్ జనతో’ను ఆలపించిన పాక్ గాయకుడు
- గాంధీజీ జయంతి సందర్భంగా ప్రదర్శన
- భారత్తోపాటు పాల్గొన్న ప్రపంచ దేశాలు
అలీ అద్భుత ప్రదర్శన చేసిన వీడియోను ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ఎంతో మంది షేర్ చేశారు. భారత విదేశాంగ శాఖ అభ్యర్థన మేరకు ప్రపంచ దేశాల్లోని కళాకారులు మహాత్మునికి ఇష్టమైన భక్తిగీతాన్ని ఆలపించేందుకు ముందుకు వచ్చారు. కానీ అలీ పాట ఎందరి హృదయాలనో బాగా ఆకట్టుకుంది. ఆయన భక్తితో, శ్రద్ధతో ఆలపించారని నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.