తెలంగాణలో టీడీపీతో పొత్తు వద్దే వద్దు: రాహుల్కు లేఖ రాయనున్న విజయశాంతి
- తెలంగాణలో టీడీపీతో పొత్తు వద్దు
- పొత్తుతో కాంగ్రెస్ భారీగా నష్టపోతుంది
- కావాలనే కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు
కాంగ్రెస్ నేతలు కొందరు అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. టీడీపీతో కనుక పొత్తు పెట్టుకుంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆమె అభిప్రాయపడినట్టు ఆమెతో సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు వల్ల హైదరాబాద్లో కొన్ని సీట్లు గెలుస్తామన్న ఉద్దేశంతోనే కొందరు నేతలు పొత్తుకు రెడీ అవుతున్నారని ఆమె విమర్శించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ త్వరలోనే రాహుల్కు లేఖ రాయాలని విజయశాంతి యోచనలో ఉన్నట్టు మెదక్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.