తండ్రితో కలసి వైసీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్!
- జగన్ సమక్షంలో తండ్రితో కలసి వైసీపీలో చేరిక
- జగన్ సీఎం అవుతారన్న కృష్ణప్రసాద్
- మరోసారి వైయస్ పాలన రావాలన్న వసంత నాగేశ్వరరావు
ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీని బలోపేతం చేయడానికి జగన్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధిపథంలోకి తీసుకెళతారన్న విశ్వాసం తనకుందని అన్నారు. వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ, మరోసారి వైయస్ పాలన తిరిగిరావాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరామని చెప్పారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని అన్నారు.