'సవ్యసాచి' ఆ స్థాయి వసూళ్లను రాబట్టాల్సిందే!
- 'సవ్యసాచి'గా నాగచైతన్య
- దర్శకుడిగా చందూ మొండేటి
- భారీ వసూళ్ల పైనే దృష్టి
ఈ సినిమాకి ముందు చైతూ చేసిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సక్సెస్ ను ఇచ్చింది. దాదాపు 25 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేసింది. దాంతో 'సవ్యసాచి' సినిమా 30 కోట్లకి పైగా వసూలు చేయాలనే ఉద్దేశంతో చైతూ వున్నాడట. ఆ స్థాయి వసూళ్లు సాధించినప్పుడే ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలోకి చేరినట్టుగా అవుతుందనేది ఆయన అభిప్రాయమట. అందువలన ఈ సినిమాతో చైతూ ఆశించే హిట్ ఇవ్వాలనే పట్టుదలతో చందూ మొండేటి వున్నాడని అంటున్నారు.