సచిన్ టెండూల్కర్ పై రేణుకా చౌదరి ఫైర్!
- రాజ్యసభలో సచిన్ ప్రసంగానికి అడ్డుతగిలిన కాంగ్రెస్ ఎంపీలు
- ధ్వజమెత్తిన బీజేపీ నేతలు
- 'భారతరత్న' మీకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిందా అంటూ రేణుక ఫైర్
ఈ క్రమంలో, కాంగ్రెస్ ఎంపీలు ప్రవర్తించిన తీరుపట్ల బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఓ దిగ్గజ ఆటగాడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి మాట్లాడుతూ, సచిన్ పై ఫైర్ అయ్యారు. 'భారతరత్న' పురస్కారం పార్లమెంట్ లో మీకు మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వాస్తవానికి యూపీఏ హయాంలోనే రాజ్యసభకు సచిన్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి 348 రోజులపాటు సభ జరిగితే... ఆయన కేవలం 23 రోజులు మాత్రమే హాజరయ్యారు. నటి రేఖ అయితే 18 రోజులు మాత్రమే సభకు వచ్చారు.