ఆన్లైన్ ద్వారా సైకత శిల్ప కళలో శిక్షణనివ్వనున్న సుదర్శన్ పట్నాయక్
- అనుమతించిన మానవ వనరుల శాఖ
- ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం
- మార్చిలో ప్రారంభం
ఈ కోర్సును ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఆయన ప్రారంభించనున్నారు. మార్చి 2018లో ప్రారంభంకానున్న ఈ కోర్సు ప్రపంచంలోనే మొదటి ఆన్లైన్ శాండ్ ఆర్ట్ సర్టిఫికెట్ కోర్సుగా నిలవనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ వీడియోల రికార్డింగ్ పనులను కూడా ప్రారంభించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
ఇప్పటికే పూరీ బీచ్లో గోల్డెన్ శాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఓ శిక్షణ కార్యక్రమాన్ని సుదర్శన్ నిర్వహిస్తున్నారు. అయితే ఆన్లైన్ కోర్సులో అందించే సూచనల ద్వారా ప్రతి ఒక్కరూ శాండ్ ఆర్ట్ మెళకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆయన వెల్లడించారు.