మధిర కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం... రెండో ఛాంబర్లోకి వ్యాపించిన మంటలు
- ఆత్కూర్ సమీపంలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్లో ప్రమాదం
- శనివారం చెలరేగిన మంటలు
- మిర్చి కాలిపోతుందని రైతుల ఆందోళన
తాజాగా రెండో ఛాంబరుకు కూడా మంటలు వ్యాపించడంతో మిర్చి కాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా మంటలు అదుపులోకి రావడం లేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి స్కై ఫైరింజన్లను పంపించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.