ఈ నెల 13న పీఎం కిసాన్ నిధుల విడుదల
- రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ
- దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు లబ్ది
- గువాహటి వేదికగా రూ.19 వేల కోట్లు రిలీజ్ చేయనున్న మోదీ
2019 లో ఎన్డీయే సర్కారు ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా.. ఏటా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీ మొత్తం రూ.19 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయని అధికారులు తెలిపారు.