దేశంలోనే వేగవంతమైన మెట్రో... మీరట్లో ప్రారంభించిన ప్రధాని మోదీ
- గంటకు 120 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించనున్న మెట్రో
- నమో భారత్ రైలు సేవలను కూడా ప్రారంభించిన ప్రధాని మోదీ
- పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్
ఈ ప్రాజెక్టులో భాగంగా నమో భారత్ రైలు సేవలను కూడా ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ-మీరట్ మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) కారిడార్పైనే మీరట్ మెట్రో కూడా నడవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దేశంలో ఒకే మౌలిక వసతులపై రెండు వేర్వేరు రైలు సేవలు నడవడం ఇదే తొలిసారి. నమో భారత్ రైలు సాధారణంగా గంటకు 160 కి.మీ., గరిష్ఠంగా 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రూ.12,390 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. 82 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. దీంతో ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.