నన్ను ప్రశ్నించడానికి మీరెవరు? అంటూ టీచర్ చెంపపై కొట్టిన విద్యార్థి
- గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో ఘటన
- పరీక్ష రాయడానికి ఆలస్యంగా వచ్చాడని మందలించిన టీచర్
- అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, బెయిల్పై విడుదల
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పంచమహల్ జిల్లాలోని షెహ్రా పట్టణంలో గల ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగిందని, ఫిబ్రవరి 3న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసు ఇన్స్పెక్టర్ అంకుర్ చౌదరి తెలిపారు.
నిందితుడిని 18 ఏళ్ల మొహమ్మద్ ఖాన్ అన్సారీగా గుర్తించినట్లు తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరచగా, బెయిల్పై విడుదల అయినట్లు వెల్లడించారు.