బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా 33 మందిపై కేసు నమోదు
- కేసీఆర్ కు సిట్ నోటీసులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టిన బీఆర్ఎస్
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఖమ్మం - వరంగల్లు జాతీయ రహదారిపై నిరసన
- సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంను అడ్డుకున్న పోలీసులు
ఈ ఘటనపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు మరో 33 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ వైపు మున్సిపల్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టినందున ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.