సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... అభినందించిన పవన్ కల్యాణ్
- చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం
- ది ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
- చంద్రబాబును దార్శనిక నేతగా అభివర్ణించిన ఏపీ డిప్యూటీ సీఎం
- ఆయన కృషితోనే స్వర్ణాంధ్ర 2047 సాధ్యమన్న పవన్
చంద్రబాబును ఒక దార్శనిక నేతగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించడం, పాలనలో సంస్కరణలు తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ, కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్య సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి మరింత శక్తి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.