తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
- కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న సూపర్ స్టార్
- ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ప్రత్యేక పూజలు
- రంగనాయక మండపంలో వేదాశీర్వచనం అందించిన పండితులు
- రజనీ కుటుంబానికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసిన అధికారులు
దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకున్న రజనీకాంత్ కుటుంబానికి వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. రజనీకాంత్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.