తెలంగాణ అసెంబ్లీలో మాగంటి గోపికి సంతాపం.. రేపటికి వాయిదా
- ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
- రేపటికి వాయిదా పడ్డ శాసనసభ, మండలి
- కాసేపట్లో జరగనున్న బీఏసీ సమావేశం
కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. శాసనమండలి కూడా రేపటికి వాయిదా పడింది. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అసెంబ్లీలో సంతాపం ప్రకటించారు.