యువకుడి ప్రాణం కాపాడిన ఏపీ పోలీసులు
- ఏలూరు జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కిన యువకుడు
- కొయ్యలగూడెం మండలం కేతవరం వద్ద ఘటన
- సమాచారంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు
- డీఎస్పీ చొరవతో సురక్షితంగా కిందకు దించిన వైనం
- యువకుడి ప్రాణాలు కాపాడటంతో తప్పిన పెను ప్రమాదం
వివరాల్లోకి వెళితే, కుటుంబ కలహాల కారణంగా తీవ్ర ఆవేదనకు లోనైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని సెల్ టవర్పైకి ఎక్కి హల్చల్ సృష్టించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ వేంకటేశ్వరరావు తన బృందంతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్పై ఉన్న యువకుడితో మాట్లాడి, అతడిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. వారి సత్వర స్పందన, సమయస్ఫూర్తి ఫలించి, యువకుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అనంతరం అతడిని సురక్షితంగా కిందకు దించి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసుల చొరవతో ఓ నిండు ప్రాణం నిలవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.