మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలి: వైఎస్ జగన్
- ఎక్స్ వేదికగా ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
- ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్న జగన్
ఈ మేరకు వై.ఎస్. జగన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.