రకుల్ప్రీత్ సింగ్ దంపతులకు 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు
- అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఈ గౌరవం
- యోగా ప్రచారంలో భాగం కావడంపై నటి ఆనందం
- ఫిట్నెస్ కోసం ఫ్యాన్సీ జిమ్లు అవసరం లేదన్న రకుల్
- ఇంట్లోనే యోగాతో ఆరోగ్యం సాధ్యమని వెల్లడి
ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... "ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డు దక్కించుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలను యోగావైపు ఆకర్షితులను చేయడంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని తెలిపారు. ఫిట్నెస్ సాధించడానికి ఖరీదైన జిమ్లు లేదా ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
"ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ములు అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్గా మారొచ్చు" అని రకుల్ వ్యాఖ్యానించారు. యోగా అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా సులభంగా ఆచరించవచ్చని తెలిపారు. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆమె సూచించారు.