కేటీఆర్, జగదీశ్రెడ్డి పిటిషన్పై హైకోర్టులో వాదనలు... కోర్టును సమయం కోరిన తీన్మార్ మల్లన్న!
- కేటీఆర్, జగదీశ్రెడ్డిలపై మేడిపల్లి పీఎస్ కేసు
- కొట్టివేయాలని హైకోర్టులో వారిద్దరి పిటిషన్
- ఫేక్ వీడియో ఆరోపణలపై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
- తప్పుడు సెక్షన్లని కేటీఆర్ తరఫు లాయర్ వాదన
- విచారణ ఈ నెల 27కు వాయిదా వేసిన హైకోర్టు
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణలో కేటీఆర్, జగదీశ్ రెడ్డిల తరఫున న్యాయవాది రమణారావు తమ వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు సరికాదని, అవి తప్పుగా నమోదు చేయబడ్డాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు పేర్కొన్న సెక్షన్లకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వాదించారు.
అనంతరం, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న తీన్మార్ మల్లన్న తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.