వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత... పోలీసు కస్టడీలో ఉండగా అకస్మాత్తుగా క్షీణించిన ఆరోగ్యం
- నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పోలీసు కస్టడీలో ఉన్న వంశీ
- అనారోగ్యానికి గురైన వంశీకి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
- తీవ్ర ఆందోళనలో వంశీ కుటుంబ సభ్యులు
వంశీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, వల్లభనేని వంశీకి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా, కంకిపాడు ఆసుపత్రి నుంచి మెరుగైన సౌకర్యాలున్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.