పాస్టర్ మృతిపై మాట మార్చిన వైసీపీ నేత బెన్నిలింగం
- రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద బెన్నిలింగం రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- పాస్టర్ ప్రవీణ్ది కచ్చితంగా హత్యేనన్న వైసీపీ నేత
- ఆ రోజు ఆవేశంలో మాట్లాడానని ఒప్పుకోలు
- పాస్టర్ది హత్యేనని చెప్పేందుకు తన వద్ద ఆధారాలు లేవని స్పష్టీకరణ
నిన్న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన బెన్నిలింగం.. ఆ రోజు ఆవేశంలో మాట్లాడానని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేదని, పాస్టర్ను హత్య చేశారని చెప్పేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని దర్యాప్తు అధికారులకు తెలిపారు. తన వీడియోను ఎడిట్ చేసి, మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించినట్టు తెలిసింది. సాయంత్రం వరకు విచారించిన పోలీసులు అనంతరం ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని విడిచిపెట్టారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు తెలిపారు.