ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు
- వచ్చే వారం విచారణకు రావాలంటూ..
- ఈ మెయిల్ ద్వారానే కాక హైదరాబాద్లోని ఆయన నివాసానికి నోటీసులు
- నిబంధనలకు విరుద్దంగా వేల కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేశారన్న ఆరోపణలు
ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
వచ్చే వారం గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. నోటీసులను ఈ-మెయిల్ ద్వారా పంపడంతో పాటు హైదరాబాద్లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ అధికారులు పంపించారు. ప్రస్తుతం ఆయన కోల్కతాలో పని చేస్తున్నారు.