కస్టడీ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ కోర్టులో వంశీ అఫిడవిట్
- దర్యాఫ్తు చేయకుండానే అరెస్టు చేశారా? అంటూ ప్రశించిన వంశీ
- సమయం వృథా చేయడమే తప్ప కస్టడీ వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్య
- ఆర్టికల్ 20(3) ప్రకారం తన వస్తువులను పోలీసులకు అప్పగించనక్కర్లేదని వాదన
పోలీసులకు తాను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని స్పష్టం చేస్తూ కస్టడీకి అప్పగించడం సమయం వృథా చేయడమేనని వాదించారు. ఆర్టికల్ 20(3) ప్రకారం తన వస్తువులను పోలీసులకు అప్పగించాల్సిన అవసరం లేదని చెప్పారు. సత్యవర్ధన్ను ఏ-5గా పేర్కొంటూ పోలీసులు క్రైం నంబరు 84/2025తో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని అఫిడవిట్కు జత చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న వంశీ.. తనకు ఇంటి నుంచి భోజనం అనుమతించాలని, మంచం కేటాయించాలని అంతకుముందు పిటిషన్ దాఖలు చేశారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు రెండ్రోజుల సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరగా కోర్టు సమ్మతించింది.