సిల్క్ స్మిత ఏ ఎండకి ఆ గొడుగు పట్టేరకం కాదు: బాబూ మోహన్
- సిల్క్ స్మిత చాలా మంచిదన్న బాబూ మోహన్
- తనని ఎంతో ఆత్మీయంగా పిలిచేదని వెల్లడి
- ఆమె కొనిపెట్టిన స్పెట్స్ దాచుకున్నానని వివరణ
- అలాంటివారిపై వివాదాలు సహజమేనని వ్యాఖ్య
"సిల్క్ స్మిత బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుని .. కాలుపై కాలు వేసుకుని కూర్చునేది. ఎవరినీ కేర్ చేసేది కాదు. హీరోలు వచ్చినా అలాగే కూర్చుంటావా? అని అడిగాను ఒకసారి. 'హీరోలు వస్తే కాలు ఎందుకు తీయాలి?' అని ఆమె అంది. బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకోవడానికి కారణం ఏమిటి అని అడిగాను .. తనని ఎవరు చూస్తున్నది గమనించడం కోసమని అంది. 'బాస్' అని పిలుస్తూ, నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేది" అని చెప్పారు.
" ఒకసారి దుబాయ్ లో షూటింగు .. షాపింగ్ కోసం నన్ను రమ్మంటే వెళ్లాను. అక్కడ ఆమె స్పెట్స్ తీసి చూపించి ఎలా ఉంది? అని అడిగింది. సూపర్ గా ఉంది అన్నాను. అయితే ఇది నీ కోసమే అంటూ కొనిపెట్టింది. దానిని నేను దాచుకున్నాను. ఆమె ఏ ఎండకి ఆ గొడుకు పట్టేరకం కాదు. అలాంటివారిపై వివాదాలు రావడం సహజమే" అని అన్నారు.