తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం... తమిళనాడు ఎన్టీకే పార్టీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
- దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం ప్రకంపనలు
- జాతీయ స్థాయిలో ఈ వ్యవహారంపై చర్చ
- ఈ వ్యవహారంపై స్పందిస్తున్న అధికారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు
- లడ్డూ తప్ప దేశంలో ఇక ఏ సమస్యలు లేవా? అంటూ మండిపడ్డ ఎన్టీకే పార్టీ చీఫ్ సీమాన్
- కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని వ్యాఖ్య
ఇక ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా అధికారులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఎన్టీకే పార్టీ చీఫ్ సీమాన్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లడ్డూ తప్ప దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా? అని ఫైర్ అయ్యారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అంతేగాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయడం ఏంటని? మండిపడ్డారు. ఈ విషయంపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారని సీమాన్ చెప్పుకొచ్చారు.