nandamuri Kalyan Ram: కల్యాణ్ రామ్ కొత్త చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్ డేట్

nkr21 shoot underway with a massive action sequence

  • కల్యాణ్ రామ్ కథానాయకుడిగా వస్తున్న మూవీకి సంబంధించి భారీ యాక్షన్ సీక్వెన్స్ 
  • శక్తివంతమైన పాత్రలో కల్యాణ్ రామ్ 
  • 150 మంది ఫైటర్లు..300  మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు

నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో శరవేగంగా రూపొందిస్తున్న నూతన మూవీకి సంబంధించి ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది. ఈ మూవీని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తుండగా, సయి మంజ్రేకర్ కథానాయిక, విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తుండగా, మూవీకి సంబంధించి ఆసక్తికర అప్ డేట్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. 15 రోజుల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మూవీలోని యాక్షన్ సన్నివేశాల్లో ఇదొక హైలెట్ అని చిత్ర బృందం వెల్లడించింది. 

ఈ సినిమా కల్యాణ్ రామ్ కేరీర్‌లో మైలు రాయిగా నిలిచిపోయేలా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయశాంతి తనకు కలిసొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News