చివరి ప్రయత్నం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్.. నేడు విచారణ
- మంగళగిరి టీడీపీ కార్యాయలం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా దేవినేని అవినాశ్
- ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
- సుప్రీం తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
అవినాశ్ ఇప్పటికే ఓసారి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆయనను హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు నుంచి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించగా కోర్టు అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను న్యాయస్థానం నేడు విచారించనుంది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపైనే ఉంది.