Ajith: అజిత్ కుమార్ హీరోగా ‘విడాముయ‌ర్చి’ అప్ డేట్!

Vidaa Muyarchi Movie Update

  • అజిత్ హీరోగా రూపొందిన ‘విడాముయ‌ర్చి’
  • కథానాయికగా అలరించనున్న త్రిష 
  • సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్ 
  • కీలకమైన పాత్రలో అర్జున్


అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'విడాముయ‌ర్చి’పై  అభిమానులలో ఆసక్తి పెరిగింది. అజిత్ లుక్ బయటకు రావడంతో ఒక్కసారిగా అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి. ‘విడాముయ‌ర్చి’ ప్రారంభం నుంచీ కోలీవుడ్, టాలీవుడ్‌లో ఈ మూవీపై అందరి దృష్టి పడింది.

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్..‘విడాముయ‌ర్చి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని, అజిత్‌తో ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 

అజిత్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలలో ఒకటైన ‘మంగాత’లో, అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు చిత్రయూనిట్ అందరూ కలిసి ఫోటోకు పోజిచ్చారు. షూటింగ్‌ను పూర్తి చేసిన ఆనందం వారి కళ్లల్లో కనిపిస్తోంది. ఎంతో సరదాగా షూటింగ్‌ను ఫినిష్ చేశారని అర్థం అవుతోంది. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది.

  • Loading...

More Telugu News