Ambati Arjun: మర్డర్ మిస్టరీగా భారీ వెబ్ సిరీస్ .. 'అగ్నిసాక్షి' 

Agnisakshi Web Series Update

  • అంబటి అర్జున్ హీరోగా 'అగ్నిసాక్షి'
  • నాయిక పాత్రలో కనిపించనున్న ఐశ్వర్య
  • 8 ఎపిసోడ్స్ గా నడిచే కథా కథనాలు
  • ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

గతంలో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ధారావాహికలలో 'అగ్నిసాక్షి' ఒకటి. ఈ ధారావాహికలో అంబటి అర్జున్ - ఐశ్వర్య ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సీరియల్ ద్వారా ఈ జంటకి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే జంటతో .. అదే టైటిల్ తో వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ ఒక రేంజ్ లోనే కొనసాగుతున్నాయి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ కొనసాగుతుంది. శంకర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంబటి అర్జున్ కనిపించనున్నాడు. ఇక మాస్ టచ్ తో సాగే పాత్రలో ఐశ్వర్య కనిపించనుంది. ఈ నెల 12 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. 


ఈ సిరీస్ లో కథానాయకుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయంలో మానసికంగా దెబ్బతిని ఉంటాడు. అదే సమయంలో అతనికి గౌరీ తారసపడుతుంది. ఆమె కూడా ఒక రకమైన సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యలోకి ఒక మర్డర్ కేసు వచ్చిపడుతుంది. ఆ మిస్టరీ వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పుతుంది అనేది కథ.

  • Loading...

More Telugu News