Team India: వాంఖెడే స్టేడియంలో టీమిండియాకు సన్మానం... మెరైన్ డ్రైవ్ లో అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం
![Mumbai marine drive filled with crowd awaiting for Team India](https://imgb.ap7am.com/thumbnail/cr-20240704tn6686a3f2797d4.jpg)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 విజేత టీమిండియా ఇవాళ స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటగాళ్లకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా అందించనుంది.
కాగా, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖె ే స్టేడియం వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. అటు, వాంఖెడే స్టేడియంలోనూ అభిమానులు పోటెత్తారు.
![](https://img.ap7am.com/froala-uploads/20240704fr6686a38ec68a9.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240704fr6686a3ea1b36a.jpg)