ఆరు నెలల్లో 11 సార్లు ఢిల్లీ వెళ్లిన ఏకైక సీఎం... రేవంత్ రెడ్డి: బీజేపీ నేత ప్రభాకర్
- ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా రేవంత్ పట్టు సాధించలేదని విమర్శ
- తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపాటు
- కేసీఆర్ కనుసన్నుల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని ఆరోపణ
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. హత్యలు, అత్యాచారాలు జరిగితే సమీక్షించే నాథుడే కరవయ్యాడన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం కొత్త ప్రయోగం చేస్తోందన్నారు.
కేసీఆర్ కనుసన్నుల్లోనే కాంగ్రెస్లోకి...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నారని ఆరోపించారు. ఆయన కనుసన్నుల్లోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు అవుతోందని... రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బ్లాక్ డేను నిర్వహిస్తోందన్నారు.