వైసీపీకి షాక్... నెల్లూరులో పార్టీకి సీనియర్ నేత రాజీనామా
- వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు రామిరెడ్డి
- ఆదాల మోసగాడు... పెద్దమనిషి ముసుగేసుకున్న నయవంచకుడని విమర్శ
- కోట్లు ఖర్చు పెట్టి కోటంరెడ్డిపై తమతో విషప్రచారం చేయించారన్న రామిరెడ్డి
- ఎన్నికల్లో పని చేసిన కార్యకర్తలను ఆదాల గాలికి వదిలేశారని ఆరోపణ
రూ.2 కోట్లు ఖర్చు పెట్టి కోటంరెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి విషప్రచారం చేయించారని ఆరోపించారు. కోటంరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై తమతో దుష్ప్రచారం చేయించారన్నారు. నాడు దుష్ప్రచారం చేసినందుకు కోటంరెడ్డిని వైవీ రామిరెడ్డి బహిరంగంగా క్షమాపణ కోరారు. ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం పని చేసిన కార్యకర్తలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇలాంటి నాయకుడు రాజకీయాలకు అనర్హుడని మండిపడ్డారు. ఆదాలకు కార్యకర్తల ఉసురు తగులుతుందన్నారు.