గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలోని వ్యాయామశాలకు వైసీపీ శిలాఫలకాలు.. ధ్వంసం చేసిన వాకర్స్
- స్టేడియంలో నూతన జిమ్ భవనం నిర్మించి వైఎస్సార్ పేరు
- శిలాఫలకాలు ధ్వంసం చేసి ఎన్టీఆర్ పేరు ఏర్పాటు చేసిన వైనం
- భవన నిర్మాణం విషయంలో అవినీతి జరిగిందన్న బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్శర్మ
ఎన్టీఆర్ స్టేడియంలోని జిమ్ వ్యాయామ పరికరాలు పాడైపోతే కొత్తవి పెట్టడం మానేసి, కమీషన్లకు కక్కుర్తిపడి కోట్ల రూపాయలతో వ్యాయామశాలను నిర్మించి దానికి వైఎస్సార్ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. దీనిపై తాము హైకోర్టుకు కూడా వెళ్లినట్టు తెలిపారు. కేసు పెండింగులో ఉండగానే వైసీపీ నేతల పేర్లతో శిలాఫలకాలు వేశారని మండిపడ్డారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.