Bharath: 'ఆహా' తెరపైకి ఒకే రోజు రెండు సస్పెన్స్ థ్రిల్లర్లు!

Miral Movie Update

  • క్రితం నెల థియేటర్లకు వచ్చిన 'మిరల్'
  • భరత్ జోడీ కట్టిన వాణి భోజన్ 
  • థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు 
  • ఈనెల 7 నుంచి స్ట్రీమింగ్


ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై సస్పెన్స్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందువల్లనే ఈ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ను ప్రేక్షకులకు అందించడానికి ఓటీటీ సంస్థలు ఆసక్తిని కనబరుస్తూ ఉంటాయి. అలా ఈ వారం 'ఆహా' రెండు సస్పెన్స్ థ్రిల్లర్లను బరిలోకి దింపనుంది. ఒకటి 'మిరల్' అయితే, మరొకటి '105 మినిట్స్'. 

ఈ రెండు సినిమాల్లో 'మిరల్' క్రితం నెలలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ - వాణి భోజన్ జంటగా నటించిన ఈ సినిమాకి, శక్తివేల్ దర్శకత్వం వహించాడు. కీలకమైన పాత్రలో కేఎస్ రవికుమార్ కనిపించనున్నాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

కథలోకి వెళితే ఒక ప్రమాదం బారి నుంచి హీరో తప్పించుకున్న దగ్గర నుంచి అతనికి అదే పనిగా ఒక పీడకల వస్తూ ఉంటుంది. మానసిక పరమైన ఆ ఇబ్బంది నుంచి భర్తను తప్పించడం కోసం అతని భార్య ఒక పరిహారం చేయాలనుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 

  • Loading...

More Telugu News