జగన్ కు 25 ఎమ్మెల్యే స్థానాలు కూడా రావు: రఘురామకృష్ణరాజు
- ఎన్నికల ఫలితాలతో జగన్ ఆశలు ఆవిరవుతాయన్న రఘురాజు
- ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘురాజు
- చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుకున్నానని వెల్లడి
మరోవైపు నిన్న ఐప్యాక్ ప్రతినిధులను కలిసిన జగన్... మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని... ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుందని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ ఆలోచించలేనన్ని సీట్లు వైసీపీకి వస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలకు రఘురాజు కౌంటర్ ఇచ్చారు.