జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది.. ఆయన పని అయిపోయింది: రఘురామకృష్ణరాజు
- మేనిఫెస్టో విడుదల తర్వాత జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందన్న రఘురాజు
- కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని జోస్యం
- షర్మిల ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్
ఐదేళ్ల జగన్ పాలనలో కుటుంబ నిర్వహణ కూడా భారంగా మారిపోయిందని... దీంతో, జగన్ ను మహిళలు కూడా వ్యతిరేకిస్తున్నారని రఘురాజు అన్నారు. ఉద్యోగులు, యువత, రైతులు, వ్యాపార వర్గాల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్... ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరినీ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రాకుండా చేసింది జగనే అని అన్నారు. సొంత చెల్లెలు షర్మిల అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.